Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

ఉపాధి హామీ కూలీలకు ఊరట

వారికి ఆధార్ పేమెంట్స్ వాయిదా..కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన ..

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు ఊరట కల్పించింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయి‌మెంట్ గ్యారంటీ స్కీమ్ వేతనాల పేమెంట్స్‌ను ఆధార్ ఆధారిత పేమెంట్ పేమెంట్స్ ద్వారా చెల్లించాలని నిర్ణయించింది. అయితే, సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచ అమలు చేయాల్సిన ఆధార్ ఆధారిత చెల్లింపులను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ 31, 2023 వరకు ప్రస్తుతం ఉన్న విధంగానే చెల్లింపులు చేయనున్నారు. ఈ మేరకు ఆగస్టు 30, 2023 రోజున పీఐబీ ఓ ప్రకటన విడుదల చేసింది. లబ్ధిదారుడు చేసిన బ్యాంక్ ఖాతా నంబర్‌లలో తరచుగా మార్పులు చేయడం, కొత్త ఖాత నంబర్లను అప్‌డేట్ చేయకపోవడం వల్ల చాలా లావాదేవీలు తిరస్కరణకు గురవుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఆధార్ ఆధారిత పేమెంట్స్ సిస్టమ్స్ అంటే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయడం. ఉపాధి హామీ పథకంలో లబ్ధిదారులు, ఫీల్డ్ స్టాఫ్, ఇతర సభ్యుల రోల్స్ వేరు వేరుగా ఉంటాయి. అయితే, వారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయడం ఇబ్బందిగా మారనుంది. బ్యాంకు ఖాతాలు అప్డేట్ చేయకపోడవే కారణంగా చెబుతోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కంద కార్మికులకు చెల్లింపులు చేయడానికి ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని సరైనదిగా కేంద్రం చెబుతోంది. ఈ పథకం అమలు చేయడానికి గడువు ఆగస్టు 31 వరకే ఉండేది. ఆ తర్వాత ఆధార్, బ్యాంక్ లింక్ చేయని వారికి వేతనాలు అందుకోవడం ఇబ్బందిగా మారనుందని కేంద్రం ఇటీవల పేర్కొంది. అయితే, ఖాతాలను అప్డేట్ చేయలేదని గుర్తించి క్రమంలో ఈ ఏడాది చివరి వరకు గడువు ఇచ్చింది. డిసెంబర్ 31 లోపు ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఫిబ్రవరి 1 వరకు గడువు ఇవ్వగా.. దానిని మార్చి 31కి పొడిగించారు. ఆ తర్వాత జూన్ 30కి, మళ్లీ ఆగస్టు 31 వరకు పొడిగించారు. మళ్లీ ఇప్పుడు ఆ గడువు సైతం ముగుస్తుండడంతో డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. యాక్టివ్ వర్కర్ల ఖాతల్లో 90 శాతానికి పైగా ఇప్పటికే ఆధార్ తో అనుసంధానించినట్లు లెక్కలు చెబుతున్నాయి. జూన్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకారం.. మొత్తం 14.28 కోట్ల మంది లబ్ధిదారుల్లో 13.75 కోట్ల లబ్ధిదారుల ఆధార్ నంబర్ సీడింగ్ చేశారు. ఇంకో 50 లక్షల మంది వరకు ఆధార్ నంబర్ లింక్ చేసుకోవాల్సి ఉంది. అందుకే మరోసారి గడువు పొడిగించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img