విశాఖ ఆర్కే బీచ్లో దారుణం జరిగింది. ఓ మహిళ అనుమానాస్పద మృతి అందర్నీ షాక్కి గురిచేసింది. డెడ్బాడీ పడి ఉన్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతదేహం ఇసుకలో కూరుపోగా కేవలం ముఖం మాత్రమే బయటకు కనిపిస్తోంది. ఇది హత్యా..? ఆత్మహత్యా అన్నది అంతుపట్టకుండా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని వివరాలు సేకరించారు. మహిళ గాజువాక నడుపూరికి చెందిన స్వాతిగా గుర్తించారు.