Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

సంక్షేమo అభివృద్ధి ఉండాలంటే మళ్ళీ జగనే రావాలి

భీమిలి శాసనసభ్యులు అవంతి

*భీమిలి నియోజకవర్గం – ఆనందపురం మండలం పెద్ది పాలెం
*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం పరిశీలకులు పసుపులేటి బాలరాజు గారు ముఖ్య అతిథిగా ఆనందపురం మండలం పెద్దిపాలెం లో ఘనంగా నిర్వహించడం జరిగింది

కార్యక్రమం లో బాగంగా అవంతి గారి చేతులు మీదుగా వైసిపి పార్టీ జెండా ను ఆవిష్కరించి
*కార్యక్రమం కి విచ్చేసిన అవంతి శ్రీనివాసరావు గారి కి బాలరాజు గారి కి నియోజకవర్గం నాయకులు భారీ కారు ర్యాలీ తో ఘనంగా సాదర స్వాగతం పలకడం జరిగింది

అనంతరం మా నమ్మకం నీవే జగనన్న అనే నినాదంతో ఈ నాలుగు ఏళ్ళలో 4వ వార్డు లో సంక్షేమం అభివృద్ధి క్రింద అందించిన వివరాలను ప్లేక్సీ రూపంలో అవిష్కరించిన దానిని అవంతి శ్రీనివాసరావు ,బాలరాజు గారి చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది

*అనంతరం కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పాలన లా దళారీ వ్యవస్థ తో పాటు కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం లేకుండా ప్రతీ అవసరానికి ప్రభుత్వ అధికారులు కార్యాలయాలు చుట్టూ విధానం లేకుండా నేరుగా మీకే పథకాలు అందాలంటే మళ్ళీ ఆంధ్రా లో ముఖ్యమంత్రి గా జగనన్నే రావాలని ఆయన వస్తే గాందీ జీ కలలు కన్న స్వరాజ్యం గ్రామ సచివాలయాలు ద్వారా మునపటి కంటే మరింత సేవలు అందించడం జరుగుతుంది.కడుపులో ఉన్న బిడ్డ నుంచి కాటికి కాలు చాచుకొనే పండు అవ్వా తాతల వరుకూ సుభిక్షమైన పాలన అందిస్తున్న జగనన్న మళ్ళీ రావాలి అంటే భీమిలి లో అవంతి అను నన్ను గెలిపించాలని పిలుపునిస్తూ మాట్లాడారు

అనంతరం జగనన్న రాష్ట్రానికి ఎందుకు కావాలి అనే విషయాన్ని గడప గడపకు నాయకులు కార్యకర్తలు అభిమానులు చేరేలా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం పరిశీలకులు పసుపులేటి బాలరాజు గారు – భీమిలి మండలం వైసిపి శ్రేణులు – సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు – కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img