Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

రథయాత్రను జయప్రదం చేయండి

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని శివానగర్లో గల శ్రీ బచ్చు నాగంపల్లి కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో శివరాత్రిని పురస్కరించుకొని శనివారం తేరు పండగ రథయాత్రను కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో శుక్రవారం స్వామివారిని దర్శించి అనంతరం వారు మాట్లాడుతూ అతి పురాతమైన ఈ శివాలయం యొక్క రథోత్సవ కార్యక్రమం మొట్టమొదటిసారిగా దాతలు, ప్రజలు, సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులలో మెలగాలని, ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు శివపార్వతుల కళ్యాణము, అనంతరం ఏడున్నర గంటలకు మడుగుతేరు లాగుట ఉంటుందన్నారు. తదుపరి మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తాదుల కొరకు దర్శన అవకాశం ఉంటుందన్నారు. తదుపరి పట్టణ పురవీధుల్లో స్వామివారిని రథము ద్వారా ఊరేగించబడునని తెలిపారు. ఈ సమయంలో విద్యుత్ ఉండదని, ప్రజలు అన్యధా భావించగా సహకరించాలని వారు కోరారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతుల ఆశీస్సులను పొంది విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పెన్నెం గోపీనాథ్, కమిటీ సభ్యులు తో పాటు రెండవ వార్డ్ కౌన్సిలర్ వేముల జయరామిరెడ్డి, ఉక్కిసల గోవిందరాజులు- నేత ,గుర్రం రాజేంద్ర- నేత, వార్డు కౌన్సిలర్లు, దాతలు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img