Friday, April 19, 2024
Friday, April 19, 2024

అర్జీదారులకు సరైన సమాధానాన్ని అందించాలి

స్పందనకు 143 వినతులు
జిల్లా కలెక్టర్‌ ఎ. సూర్య కుమారి

విశాలాంధ్ర – విజయనగరం: సోమవారం కలెక్టరేట్‌ నందు నిర్వహించిన స్పందనకు ప్రజల నుండి 143 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 24, డి.ఆర్‌.డి.ఏ.కు 01, హౌసింగ్‌ కు 10, మున్సిపల్‌ శాఖకు 08, ఇతర శాఖలకు సంబంధించి 03 అందగా అత్యధికంగా రెవిన్యూ కు సంబంధించి 97 వినతులు అందాయి. ముఖ్యంగా సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, భూ సమస్యలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులను జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, డి.ఆర్‌.ఓ గణపతి రావు ఉప కలెక్టర్లు సుదర్శన దొర, సూర్యనారాయణ, పద్మావతి స్వీకరించారు. అనంతరం అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీదారులతో మాట్లాడి వారికీ సరైన సమాధానాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. అదే విధంగా కమ్యూనిటీ అవసరాలపై అందిన ఆర్జీల పై ప్రత్యెక దృష్టి పెట్టాలని, ప్రజా అవసరాల కోసం పదే పదే రాకూడదని త్వరగా పరిష్కరించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img