Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి

విశాలాంధ్ర-సీతానగరం: ఏప్రిల్ ఐదున చలో ఢిల్లీ కార్యక్రమంను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు పిలుపు నిచ్చారు. మంగళ వారం పెదబోగిలి గ్రామ పంచాయతీ చెత్త సంపద కేంద్రం వద్ద సమావేశం నిర్వహించారు.ముందుగా గోడ పత్రికలను విడుదల చేశారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం కార్మికులు ,రైతులు ,ప్రజల సమస్యలను మరింత జటిలంచేస్తుందని ,వారి కోర్కెలను ఆమోదించకుండా ,అత్యంత ధనవంతులైన ఆదాని ,అంబానీ వంటి వారి సేవలో మునిగి తేలుతుందన్నారు.దేశ రాజ్యాంగం ప్రసాదించిన కనీస ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, అడిగినవారిని జైలుకు పంపిస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక ప్రజావ్యతిరేక విధానాలకు బదులుగా ప్రజా అనుకూల విధానాల కోసం ఏప్రిల్ 5న చలో ఢిల్లీలో జరిగే కార్మిక కర్షక పోరాట ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమా వేశంలో మండల కార్యదర్శి జి వెంకటరమణ,మండలంలోని అన్ని గ్రామాల గ్రీన్అంబాసిడార్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img