సి.ఎం.జగన్ జన్మదినం సందర్భంగా బహూకరించిన వై.ఎస్.ఆర్.సి.పి.
అందజేసిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
విశాలాంధ్ర – విజయనగరం రూరల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని ఘోషా ఆసుపత్రికి రూ.లక్ష విలువైన పరికరాలను విరాళంగా అందజేశారు. రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి, నియోజక వర్గ పరిశీలకులు, ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్ (లల్లు) ఈ పరికరాలను బుధవారం ఘోష ఆసుపత్రి సూపరింటెండెంట్కు అందజేశారు. ఇందులో నాలుగు స్ట్రెచర్లు, బి.పి. యంత్రం, స్టెతస్కోప్లు వున్నాయి. ఆసుపత్రిలో ఈ పరికరాల అవసరం ఎంతగానో వుందని ఇటీవలి కాలంలో ఆసుపత్రిని సందర్శించినపుడు ఆసుపత్రి వైద్యులు తనకు చెప్పారని, అందుకే పార్టీ తరపున ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా అందజేశామని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి చెప్పారు. ఆసుపత్రికి ఏ అవసరం వచ్చినా తమ పార్టీ ద్వారా సహకరించేందుకు సిద్ధంగా వున్నామని డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చెప్పారు.