Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహణ

విశాలాంధ్ర, పార్వతీపురం: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ ద్వారపు రెడ్డి జగదీశ్, మాజీఎమ్మెల్యే, నియోజక వర్గ ఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు, టీడీపి నాయకులు గర్బాపు ఉదయభానుల ఆద్వర్యంలో టీడీపీ నాయకులంతా బైపాస్ రోడ్డులోగల శ్రీషిర్డీసాయి దేవాలయం వద్దకు చేరుకొని పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలనుకొట్టి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతోఉండాలని,రానున్న సాధారణ ఎన్నికలలో ముఖ్యమంత్రిగా కావాలని కోరుతూ పూజలు నిర్వహించారు.అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంవద్ద పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. కేకుని కోసి జన్మదిన వేడుకలును ఘనంగా నిర్వహించారు.క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును రానున్న సాధారణ ఎన్నికలలో ముఖ్యమంత్రి చేసేందుకు అంతా కలిసికట్టుగా పనిచేద్దామని నాయకులంతా ముక్తకంఠంతో తెలిపారు. ఆయన పార్టీకీ,రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ద్వారపురెడ్డి శ్రీదేవి,పట్టణ అధ్యక్షుడు గుంట్రెడ్డి రవికుమార్,పార్వతీపురం అద్యక్షుడు దొగ్గ మోహన్, పట్టణ కౌన్సిలర్లు బడే గౌరునాయుడు, తాతపూడి వెంకటరావు, కోలా సరితమధుసూధనరావు, పార్టీ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, రెడ్డి శ్రీనివాసరావు, గర్భాపు ఉదయభాను, కోలాబాబు,బోను దేవీచంద్రమౌళి, నారాయణరావు, కెంగువ సుధీర్, బంకపల్లి రవికుమార్, కోలా వెంకటరావు, సిరిపురపు భాస్కరరావు, తాన్న ప్రసాద్, గొంగాడ రామమూర్తి,  మరిశర్ల కార్తీక్ నాయుడు, శంబంగి తిరుపతిరావు, బేత లక్ష్మణరావు, మరియదాస్, జాగాన రవిశంకర్, బుడితిశ్రీరాములు, గొరజాన చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img