Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జగనన్న అందిస్తున్న సేవలు- సీతం రాజుకు విజయసోపానాలు

– డీసీఎంఎస్ చైర్ పర్సన్ డాక్టర్ అవనాపు భావన విక్రమ్
విశాలాంధ్ర -విజయనగరం : అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ది పధంలో ముందుకు తీసుకువెళ్లేందుకు అహార్నిశలు కృషిచేస్తున్న అలుపెరగని పోరాటయోధులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ.శ్రీ వై.ఎస్ జగన్మోహాన్ రెడ్డి సేవలు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి సీతం రాజు సుధాకర్ విజయసోపానాలుగా నిలుస్తాయని ఉమ్మడి విజయనగరం జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీ (ణజవీూ) చైర్ పర్సన్ డా. అవనాపు భావన అన్నారు. సోమవారం విజయనగరంలోని బ్యాంకు కాలనీ, అలకనందా కాలనీలలో డీసీఎంఎస్ చైర్ పర్సన్ డా.అవనాపు భావన, వైకాపా నాయకులు అవనాపు విక్రమ్ లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఉత్తరాంధ్ర గ్యాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. బాలాజీ వాకర్స్ క్లబ్, తొష్నివాలా వాకర్స్ క్లబ్ సభ్యులను కలసి సీతంరాజు సుధాకర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, అఖండ విజయాన్ని అందించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహాన్ రెడ్డి గారు విద్య, వైద్య రంగాలకు ఎనలేని సేవలు అందిస్తున్నారని, నేటి విద్యార్ధులే రేపటి దేశ భవిష్యత్ గా గుర్తించి నాడు- నేడు కార్యక్రమం ద్వారా కార్పోరేట్ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నారని, ముఖ్యమంత్రి సేవలను గుర్తించి, సీతంరాజు సుధాకర్ కు పట్టభద్రులు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్దికి నిరంతరం తపిస్తున్న శ్రామికుడు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గారు అని, సిఎం బలపర్చిన అభ్యర్ధి సీతంరాజు సుధాకర్ విజయానికి ప్రతి ఒక్క పట్టభద్రుడు అండగా నిలవాలని అవనాపు విక్రమ్, భావన దంపతులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ వాకర్స్ క్లబ్, తోష్నివాలా వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img