Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలి 

విశాలాంధ్ర/సీతానగరం: మూడుజిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీఅభ్యర్థిగా టీడీపీ తరుపున పోటీచేస్తున్న డాక్టరు వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని బలిజిపేట, సీతానగరంటీడీపీనాయకులు కోరారు. పట్టభద్రుడైన ప్రతీఓటరు తమ అమూల్యమైన ఓటును ఆలోచన చేసి విజ్ఞుడైన చిరంజీవిరావుకు వేయాలని కోరారు. విద్యావంతుడైన చిరంజీవిరావును గెలిపిస్తే పట్టభద్రులు సమస్యలపట్ల అవగాహన ఉన్నందున వారిసమస్యల పరిష్కారంకోసం కృషి చేస్తారని చెప్పారు. వారందరికీ కరపత్రాలు అందజేసి మద్దతు పలకాలని కోరారు. ఈకార్యక్రమంలోటిడిపి మండల పార్టీ అధ్యక్షుడు కొల్లితిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, పెదభోగిలిసర్పంచ్ తేరేజమ్మ గరికయ్య, టీడీపి నాయకులు బుడితిశ్రీనివాసరావు, కె రామక్రిష్ణ నాయుడు, ఉడమల సూర్యనారాయణ, భాస్కరరావు సబ్బాన శ్రీనివాసరావు,సింహాచలంనాయుడు, బి లక్ష్మణ, యోగేశ్వరరావు, శంకరరావుమాస్టారుతదితరులు పాల్గొన్నారు.బలిజిపేట మండలంలో పార్టీ ప్రెసిడెంట్ పెంకి వేణుగోపాలనాయుడు గవాడాడరాము, క్లస్టర్ ఇంచార్జ్ సాదు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కోటసీతారంపురం గ్రామంలో బుదవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో ధాన్యం బస్తాలు కాలుపోయిన రైతులను టీడీపీ నేతలు పరామర్శ చేశారు. అధికారులు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img