Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవిరావును గెలిపించండి

మాజీ ఎమ్మెల్సీ జగదీశ్, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు
విశాలాంధ్ర,పార్వతీపురం/సీతానగరం: మూడుజిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ తరుపున పోటీచేస్తున్న డాక్టరు వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి అత్యదిక మెజారిటీతో గెలిపించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి  జగదీశ్ , మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు పిలుపునిచ్చారు.మంగళవారం పట్టణంలోని పలువార్డులలో టీడీపీనాయకులతో కలిపి ప్రచారాన్ని నిర్వహించారు.పట్టభద్రుడైన ప్రతీఓటరు తమ అమూల్యమైన ఓటును ఆలోచనచేసి విజ్ఞుడైన చిరంజీవిరావుకు వేయాలని కోరారు. విద్యావంతుడైన చిరంజీవిరావును గెలిపిస్తే పట్టభద్రులు సమస్యలపట్ల అవగాహనఉన్నందున వారిసమస్యల పరిష్కారంకోసం కృషి చేస్తారని చెప్పారు. వారందరికీ కరపత్రాలు అందజేసి మద్దతుపలకాలని కోరారు. రెండు పూటల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తూ అభ్యర్ధి గెలుపుకు కృషి చేస్తున్నట్లు ఆయనతెలిపారు.ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ద్వారపురెడ్డి శ్రీదేవి, టిడిపిపట్టణ మండల పార్టీ అధ్యక్షులు గుంట్రెడ్డి రవికుమార్, దొగ్గ మోహన్, టీడీపి నాయకులు గర్భాపు ఉదయభాను, తాతపూడి వెంకటరమణ, బడే గౌరునాయుడు, బోను దేవీచంద్ర మౌళి, నారాయణరావు, కెంగువ సుధీర్, బంకపల్లి రవికుమార్, కోలా వెంకటరావు, సిరిపురపు భాస్కరరావు, తాన్న ప్రసాద్, గొంగాడ రామమూర్తి, చందక దేశాలు, మరిశర్ల కార్తీక్ నాయుడు, శంబంగి తిరుపతిరావు, బేత లక్ష్మణరావు, మరియదాస్, జాగాన రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు
పార్వతీపురం రూరల్ లో…
పట్టభద్రుల ఎమ్మెల్సీఅభ్యర్థిగా టీడీపీ తరుపున పోటీచేస్తున్న డాక్టరు వేపాడ
చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని టీడీపీ నియోజక వర్గ ఇంచార్జి, మాజీఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కోరారు.ఆయన పార్వతీపురం,సీతానగరం మండలంలోని పలుగ్రామాలో ఆయా మండల టీడీపీనాయకులతో కలిపి ప్రచారాన్ని నిర్వహించారు.పట్టభద్రుడైన ప్రతీఓటరు తమ అమూల్యమైన ఓటును ఆలోచనచేసి విజ్ఞుడైన చిరంజీవిరావుకు వేయాలని కోరారు. ఆయనతో పాటు టీడీపీ నేతలు గొట్టాపు వెంకట నాయుడు, రెడ్డి శ్రీనివాసరావు, బోను చంద్రమౌళి, జాగాన రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
సీతానగరంమండలంలో…
మండలంలోని పలు గ్రామాలలో టిడిపి నాయకులు చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు.
ఈకార్యక్రమంలోటిడిపి మండల పార్టీ అధ్యక్షుడు కొల్లితిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్,టీడీపి నాయకులు బుడితిశ్రీనివాసరావు, పైల నాగభూషణరావు, కె రామక్రిష్ణనాయుడు, ఉడమల సూర్యనారాయణ, భాస్కరరావు, శ్రీనివాసరావు,లక్ష్మణరావు, ఉమా, రెడ్డిసింహాచలంనాయుడు, సత్యంనాయుడు, గరికయ్య, సతీష్,గుంపస్వామి,సింహాచలంనాయుడులక్ష్మణ, యోగేశ్వరరావు, జగన్నాధం,శంకరరావుతదితరులు పాల్గొన్నారు.
బలిజిపేట మండలంలో…
ఇదిలాఉండగా బలిజిపేట మండలంలోని పలుగ్రామాల్లోకూడా టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావుకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు.పార్టీ అధ్యక్షుడు పెంకి వేణుగోపాల్,నాయకులు వాడాడ రాము తదితరులుఆద్వర్యంలో ప్రతీ ఓటరు ఇంటికి వెళ్లి ఓటు వేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img