Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవికి మొదటి ప్రాధాన్యత ఓటువేయండి

విశాలాంధ్ర-సీతానగరం: మూడుజిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీఅభ్యర్థిగా టీడీపీ తరుపున పోటీచేస్తున్న డాక్టరు వేపాడ చిరంజీవికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని బలిజిపేటమండల టిడిపి అధ్యక్షుడు పెంకి వేణుగోపాల్, టీడీపి నియోజక వర్గనేత వాడాడ రాములు విజ్ఞప్రి చేస్తున్నారు. మంగళవారం వారు పెదపెంకి గ్రామంలో సమావేశం నిర్వహించి ప్రతీ పట్టభద్రుడైన ఓటరునికలిసి ఓటు అడగాలని నిర్ణయించామని చెప్పారు.మాజీ ఎమ్మెల్సీ, టీడీపి రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్,మాజీఎమ్మెల్యే,నియోజక వర్గ ఇంచార్జి బొబ్బిలి చిరంజీవుల సూచనలు మేరకు ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యావంతుడైన చిరంజీవిని గెలిపిస్తే పట్టభద్రులు సమస్యల పట్ల అవగాహన ఉన్నందున వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని చెప్పారు. ఇదిలాఉండగా వాడాడ రాముకు ఎన్టీఆర్ జాతీయ జీవన సాఫల్యపురస్కారం విశాఖ జిల్లాకు చెందిన ఒక సంస్థ ప్రకటించిన సందర్భంగా నియోజక వర్గంలో టీడీపీ నాయకులు ఆయన్ను అభినందించారు.ఇదిలాఉండగా సీతానగరం మండలంలోని పెదభోగిలి మేజర్ పంచాయతీలో చిరంజీవిరావుకు మద్దతుగా ఓట్లు వేయాలని టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు కొల్లి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్, సర్పంచ్ తేరేజమ్మ గరికయ్య,మాజీ సర్పంచ్ బుడితిశ్రీనివాసరావు, సబ్బాన శ్రీనివాసరావు,సింహాచలం నాయుడు తదితరులు పాల్గొని ప్రచారం నిర్వహించారు. పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు గుంట్రెడ్డి రవికుమార్, మండలపార్టీఅధ్యక్షుడు దొగ్గ మోహన్ ల ఆద్వర్యంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొని వేపాడకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img