Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నిడగల్లు గ్రామంలో జగనన్నే మా భవిషత్ కార్యక్రమం 

ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఎమ్మెల్యే, పరిశీలకులు
విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని  నిడగల్లు గ్రామంలో సోమవారంనాడు నాలుగో రోజు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంను నిర్వహించారు.ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జోగారావు, పార్టీ పరిశీలకులు శోభా హైమావతిలు పాల్గొన్నారు.గ్రామంలోని ప్రజల ఇళ్లకు వెళ్లి వారిని నేరుగా కలుసుకొని వారికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేకూరిన లబ్ధి, పొందిన ప్రయోజనాలను ముందుగా వివరించారు. ఇంటి తలుపుపై జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టికర్ ను మరియు ఫోన్ పై స్టిక్కర్ను అతికించి వారితో కలిసి ఫోటో దిగారు. రానున్న సాధారణ ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా వైఎస్ జగ్మోహన్ రెడ్డిని చేసేందుకు సహకారాన్ని అందించాలని కోరారు.ఈకార్యక్రమంలో మండల వైఎ్సార్సీపీ అద్యక్షుడు బొంగు చిట్టిరాజు, ఎంపిపి ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, జెడ్పీటీసీ బాబ్జి, వైస్ ఎంపిపి సూర్యనారాయణ, గ్రామ కన్వీనర్లు గాజాపుశ్రీనివాసరావు, పరువాడ తిరుపతి రావు, తెంటు వెంకట అప్పల నాయుడు తదితర కన్వీనర్లు,గృహ సారథులు,వాలంటీర్లు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img