Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పెదంకలం సచివాలయం నుండి ఇద్దరు వాలంటీర్లకు సేవావజ్ర పురస్కారం

విశాలాంధ్ర-సీతానగరం: మండలంలోని పెదంకలం సచివాలయంలో పెదంకలం, సుమిత్రపురం గ్రామపంచాయతీలకు చెందిన ఇద్దరు వాలంటీర్లకు సేవావజ్ర పురస్కారాలు లభించాయి. సేవావజ్ర క్రింద 30వేల రూపాయల నగదు, శాలువాతో సత్కారం, ప్రశంసా పత్రాలను శుక్రవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర, జిల్లా కలెక్టరు నిషాంత్ కుమార్ , ఎమ్మెల్యే జోగారావు చేతుల మీదుగా వారు అందుకున్నారు.మండలం నుండి సేవా వజ్ర సత్కారం పొందిన వారిద్దరి వాలంటీర్లను ఎంపిపి బలగ రవణమ్మ, జెడ్పీటీసీ మామిడి బాబ్జి, మండల వైఎస్ఆర్సీపీ అద్యక్షుడు బొంగు చిట్టిరాజు, ఎంపిడిఓ ప్రసాద్, ఈఓపిఆర్ది వర్మ,ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు బలగ శ్రీనివాసరావు,ఉమా మహేశ్వరరావు,పంచాయతీ కార్యదర్శులు కె. గౌరీశ్వరి,
ఆర్ సోమేశ్వరరావు,సచివాలయం సిబ్బంది, తోటివాలంటీర్లు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img