Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పెదభోగిలి మేజర్ పంచాయతీ వేలంపాట నిర్వహణ


విశాలాంధ్ర,సీతానగరం: మండల కేంద్రము లోని పెదభోగిల మేజర్ గ్రామపంచాయితికీ సంబందించిన 2023-24 ఆర్థిక సంవత్సరం వేలం పాటను మంగళ వారం సర్పంచ్ జొన్నాడ తేరేజమ్మ అధ్యక్షతన నిర్వహించారు.గ్రామానికి చెందిన మర్రి చిన్నయ్య, బొత్స కాసులమ్మ, పిట్ట త్రినాధమ్మలు వేలం పాటలో పాల్గొన్నారు. బహిరంగ వేలంపాటలో ముగ్గురు పాటదారులలో మర్రి చిన్నయ్య
రూ. 1,71,000/- హెచ్చుపాటను పాడడం ద్వారా ఆయనకు నిర్ణయించడం జరిగిందని మండల పంచాయతీ విస్తరణ అధికారి కె కె కె వర్మ తెలిపారు. జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు వేలం పాటను నిర్వహించి ఖరారు చేసినట్లు ఆయనచెప్పారు. గత ఏడాది రూ.1,14, 000/-లకు వేలం పాట పాడగా, ఈఏడాది 54వేల రూపాయలు అదనంగా వచ్చినట్లు చెప్పారు. ఈవేలంపాటలో పంచాయతీ ఈఓ వెంకటరావు, సెక్రటరీ సుధారాణి, జూనియర్ అసిస్టెంట్ రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img