Friday, April 19, 2024
Friday, April 19, 2024

బిజెపికి మద్దతంటే ప్రజలకు ద్రోహం చేయడమే…

రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిన జగన్ననీ నమ్మవద్దు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య,

విశాలాంధ్ర -రాజాం : రాజాం నియోజకవర్గం లో సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ , సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.శంకర్ రావు అద్యక్షతన ప్రచార భేరి సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య ,సీపీఎం జిల్లా కార్యదర్శి టి.సూర్యనారాయణ మాట్లాడుతూ మోదీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి శూన్యమని, ప్రజల ఆస్తులైన ప్రభుత్వరంగ సంస్థలు రైల్వే,రక్షణ,ఎల్ఐసి, బ్యాంకులు,ఓడరేవులు, వ్యవసాయం కార్పోరేట్ వ్యక్తులైన ఆదాని అంబానీలకు గుంపుగుత్తగా అమ్మేస్తున్నారని విమర్శించారు. .గో రక్షణ పేరుతో నిత్యం దళిత,గిరిజనలపై దాడులు జరుగుతున్నాయన్నారు.బిజెపి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి మోదీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ఎద్దేవా చేశారు.విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి పేదల అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.దేశ సంపదను ఆదాని అంబానీ లాంటి దొంగల చేతిలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ హటావో దేశ బచావో నినాదంతో ప్రజలందరూ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు.మోదీ తొమ్మిదేళ్ల పాలనలో కోట్లకు పడగలెత్తిన కుబేరులకు తప్ప సామాన్య ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని రైతులు, కార్మికులు,యువకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మోదీ పాలనపై విసికెత్తిపోయారన్నారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి బిజెపి ప్రభుత్వానికి మద్దతు పలికి ప్రజలపై పన్ను భారాలు వేయటమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు.రాష్ట్రంలో విభజన చట్టాలు,ప్రత్యేక హోదా,తారకరామ,పోలవరం ప్రాజెక్టులకు నిధులు,వెలిగొండ ప్రాజెక్టు పూర్తి వంటి సమస్యలపై బిజెపిని నిలదీసే సత్తా లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు విద్యుత్ చార్జీలు,చెత్త చార్జీలు,ఆస్తి పన్ను, బస్సు చార్జీలు ఏడుసార్లు పెంచిన జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసి సంక్షేమం లేకుండా రాష్ట్రాన్ని 40 ఏళ్ల అభివృద్ధి వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో బిజెపికి మద్దతు పలికే పార్టీలన్నీ కమ్యూనిస్టులకు శత్రువులే అని హెచ్చరించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను కమ్యూనిస్టులు నిరంతరం వ్యతిరేకిస్తారన్నారు.రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైన రాష్ట్రంలో పర్యటనకు రావచ్చునని అది రాజ్యాంగం కల్పించిన హక్కుని అన్నారు.వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో దళితులపై హత్యలు దారుణాలు మారణహోమాలు జరిగితే మాట్లాడని మంత్రి ఆదిమూలపు సురేష్,చంద్రబాబు పర్యటనలో చొక్కా విప్పి రోడ్డుపై బైఠాయించడం ఏమిటని ప్రశ్నించారు.రాష్ట్రంలో దళితులైన అచ్చన్న ,సుధాకర్ ,జడ్జి రామకృష్ణలను దారుణంగా హింసించి హత్య చేస్తే మాట్లాడని ఆదిమూలపు సురేష్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.ఆధిమూలపు సురేష్ మంత్రి పదవిని కాపాడుకునేందుకే ఇలాంటి డ్రామాలకు తెరలేపారన్నారు.
లికేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందాయని ప్రజలు వచ్చే ఎన్నికల్లో మోడీ జగన్ కు తగిన బుద్ధి చెబుతారన్నారు..ఈ కార్యక్రమంలో,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. కృష్ణ, ఎన్.నాగభూషణం, సీపీఎం జిల్లా నాయకులు కె.సురేష్,విశ్వనాథం, త్రినాథ్,సీపీఐ నియోజక వర్గ సహాయ కార్యదర్శులు ఉల్లాకుల నీలకంఠేశ్వర యాదవ్,కనక రాజు సీపీఐ సీపీఎం నాయకులు గణపతి, ప్రభాకర్, గంగారం, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img