Friday, April 19, 2024
Friday, April 19, 2024

మధనాపురం సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్‌

విశాలాంధ్ర – గంట్యాడ : గంట్యాడ మండల పరిధిలోని మధనాపురం గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్‌ ఎ. సూర్యకుమారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఇటీవల కాలంలో ప్రజల నుంచి వచ్చిన సర్వీస్‌ రిక్వెస్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రగతి నివేదికలను, హాజరు పట్టీలను తనిఖీ చేశారు. ఓటుకు ఆధార్‌ అనుసంధానం, ఓటర్ల జాబితా సవరణ, ఇళ్ల నిర్మాణాల ప్రగతి, సర్టిఫికేట్ల జారీ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సత్వర సేవలందించాలని సచివాలయ ఉద్యోగులకు కలెక్టర్‌ సూచించారు. ఆమె స్థానిక మండల రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ అధికారులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img