Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మా నమ్మకం నువ్వే జగన్‌- జగనన్నే మా భవిషత్ కార్యక్రమాలు నిర్వహణ

విశాలాంధ్ర,సీతానగరం: మా నమ్మకం నువ్వే జగన్ – జగనన్నే మాభవిష్యత్ అన్న కార్యక్రమాన్ని శుక్రవారం మండలంలో పలుగ్రామాల్లో ప్రారంభించడం జరిగిందని మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొంగు చిట్టిరాజు తెలిపారు. రాష్ట్ర, జిల్లా పార్టీ ఆదేశాలతో పాటు ఎమ్మెల్యే జోగారావు సూచనలు మేరకు అన్ని గ్రామాలలో ఉత్సాహంగా చేస్తున్నట్లు తెలిపారు.సూరమ్మపేట గ్రామంలో ఆయన పాల్గొనగా పెదంకలంలో ఎంపిపి బలగ రవనమ్మశ్రీరాములు నాయుడు, లచ్చయ్యపేటలో జెడ్పీటిసి బాబ్జిల ఆద్వర్యంలో నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన స్టిక్కర్లు మరియు కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జగనన్నే మా భవిష్యత్ అనేనినాదంతో ప్రజలతో మమేకం అవ్వడానికి ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు . గతప్రభుత్వాలకు- జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు. నవరత్నాలు పథకాలుద్వారా అర్హులైన పేదలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కింది అన్నారు. ప్రజలందరూ కూడా జగన్ ఆశీర్వదించాలని వారు కోరారు. పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు.మండలంలోని అన్ని గ్రామాలలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సచివాలయం కన్వీనర్లు గృహసారథులు, వైఎస్సార్సీపీ అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img