Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మొక్కజొన్న పంట నష్టాన్ని పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి

విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని గత రెండురోజులుగా కురిసిన ఆకాల వర్షాలకు లక్ష్మీపురం గ్రామంలో నెలకొరిగిన మొక్క జొన్న పంటను మంగళవారం మండల వ్యవసాయాధికారి సవరపు అవినాష్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ డెరైక్టర్ ఆదేశాలు మేరకు క్షేత్ర స్థాయిలో పంట పొలాలను పరిశీలించారు.మొక్కజొన్న పాలుపోసుకొన్న దశలోఉండి మొక్కలు గాలులకు, వర్షాలకు విరిగి రైతు పొలంలో 33శాతం నష్టం వాటిల్లతే అటువంటి వాటిని నమోదుచేసి జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తామని తెలియచేసారు. ఇప్పటివరకు లక్ష్మిపురం గ్రామంలో 10 మంది రైతులకు చెందిన 10ఎకరాలు మొక్కజొన్న పంట నష్టం వచ్చిందని ప్రాధమిక అంచనాగా గుర్తించామని చెప్పారు.పూర్తినష్టం రేపటినుండి నమోదు చేసి ఉన్నత అధికారులకు తెలియచేస్తామన్నారు. ఈపంట నమోదు తెలియచేసారు ఈ పంట నమోదు తప్పనిసరి గా ఉండాలన్నారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img