Friday, April 19, 2024
Friday, April 19, 2024

విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు ధర్నా

విశాలాంధ్ర,సీతానగరం: విద్యుత్ చార్జీలకు నిరసనగా పాల్గొన్న మండల తెలుగుదేశం పార్టీఅధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు కొల్లి తిరుపతిరావు రౌతు వేణుగోపాల్ ఆద్వర్యంలో మండలంలోని అప్పయ్య పేట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు.పెంచినా విద్యుత్ ఛార్జీలు, వివిధ రకాల చార్జీలు పేరిట పెంచుతున్న చార్జీలు తగ్గించాలని కోరుతూ వారంతా నిరశన వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో పెదబోగిల,రామవరం సర్పంచులు జొన్నాడ తేరేజమ్మ, పెంట సత్యం నాయుడు, క్లస్టర్ ఇంచార్జీలు బొమ్మినేని లక్ష్మణరావు బుడితి శ్రీనివాసరావు, కొల్లి సురేష్, కర్రి శంకర్రావు, మర్రాపు యోగేశ్వరరావు, జక్కు పకీరునాయుడు యాల రామినాయుడు, జక్కు పకీర్ నాయుడు, ఉడమల సూర్యనారాయణ, నడగాన వెంకయ్య, నడిమింటి ధనంజయ, లబ్బ శ్రీనివాసరావు, సబ్బాన శ్రీనివాసరావు, చింతాడ సత్యం, పెంట ఉమా ,రెడ్డి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏఈ కోట్ల సోమేశ్వరరావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఏ ఎస్ఐ లంక శ్రీనివాసరావు ఆద్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img