Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వెంకటపురం గ్రామంలో ఎమ్మెల్యే జోగారావు ఆద్వర్యంలో జగనన్నే మా భవిషత్ కార్యక్రమం 

విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని  వెంకటపురం(కామన్నదొరవలస)గ్రామంలో సోమవారంనాడు నాలుగో రోజు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంను నిర్వహించారు.ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జోగారావు, పార్టీ పరిశీలకులు శోభా హైమావతిలు పాల్గొన్నారు.గ్రామంలోని ప్రజల ఇళ్లకు వెళ్లి వారిని నేరుగా కలుసుకొని వారికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేకూరిన లబ్ధి, పొందిన ప్రయోజనాలను ముందుగా వివరించారు. ఇంటి తలుపుపై జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టికర్ ను మరియు ఫోన్ పై స్టిక్కర్ను అతికించి వారితో కలిసి ఫోటో దిగారు. రానున్న సాధారణ ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా వైఎస్ జగ్మోహన్ రెడ్డిని చేసేందుకు సహకారాన్ని అందించాలని కోరారు.ప్రతిపక్షాల చేస్తున్న లేనిపోని ఆరోపణలు తిప్పి కొట్టాలని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల వైఎ్సార్సీపీ అద్యక్షుడు బొంగు చిట్టిరాజు, ఎంపిపి ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, జెడ్పీటీసీ బాబ్జి, వైస్ ఎంపిపి సూర్యనారాయణ, సర్పంచ్ బుడితిశ్రీనివాసరావు, గ్రామ కన్వీనర్లు బుడితి గౌరు నాయుడు, బుడితి ముకుంద, ఏగిరెడ్డ గోపాల్ గాజాపుశ్రీనివాసరావు,తెంటు వెంకట అప్పలనాయుడు, ఆర్వీ పార్థసారథి, పోల ఈశ్వరనారాయణ, మర్రాపు ధనం తదితర కన్వీనర్లు,గృహ సారథులు,వాలంటీర్లు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img