Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

23న స‌ర్కిల్ స్థాయి డాక్ అదాల‌త్‌

త‌పాలా శాఖ సూప‌రింటెండెంట్ ఈశ్వ‌ర‌రావు

విశాలాంధ్ర – విజ‌య‌న‌గ‌రం: ఈ నెల 23న విజ‌య‌వాడ వేదిక‌గా స‌ర్కిల్ స్థాయి డాక్ అదాల‌త్ నిర్వ‌హిస్తున్న‌ట్లు విజ‌య‌న‌గ‌రం త‌పాలా శాఖ‌ సూప‌రింటెండెంట్ ఈశ్వ‌ర‌రావు మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. చీఫ్ పోస్ట్ మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆదేశాల మేరకు ఆంధ్ర‌ప్రదేశ్ లోని త‌పాలా కార్యాలయాల‌లో అందించే సేవ‌ల‌కు సంబంధించిన అంశాల‌పై జ‌న‌వ‌రి 23వ తేదీ 11.30 గంట‌ల‌కు విజ‌య‌వాడ పోస్ట‌ల్‌ స‌ర్కిల్ కార్యాల‌యంలో రాష్ట్ర‌స్థాయి డాక్ అదాల‌త్ నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. సంబంధిత ఫిర్యాదుల‌ను ఈ నెల 18వ తేదీ లోగా మెయిల్ లేదా పోస్ట‌ల్ ద్వారా కె. సుధీర్ బాబు, అసిస్టెంట్ పోస్ట్ మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ (ఫిర్యాదులు – సంక్షేమం), చీఫ్ పోస్ట్ మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యం, ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కిల్, విజ‌య‌వాడ – 520 013 చిరునామాకు పంపించాల‌ని సూచించారు. పోస్ట్ క‌వ‌ర్‌పై డాక్ అదాలత్ అని స్ప‌ష్టంగా రాయాల‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img