Monday, March 20, 2023
Monday, March 20, 2023

8 మంది బిసి హాస్టల్‌ బాలికలు ఆసుపత్రికి తరలింపు

చికిత్స అనంతరం కోలుకుంటున్న విద్యార్థినులు
జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి

విశాలాంధ్ర – విజయనగరం: స్వల్ప అనారోగ్యానికి గురైన కొత్తవలస బిసి గర్ల్స్‌ హాస్టల్‌ బాలికలు 8 మందికి ఆసుపత్రుల్లో చికిత్సను అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హాస్టల్‌లో మొత్తం 57 మంది విద్యార్థినులు ఉన్నారని, వీరిలో 8 మంది మాత్రమే, ఈ రోజు ఉదయం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. దీంతో ముందు జాగ్రత్తగా ముగ్గురిని ఎస్‌.కోట ప్రభుత్వాసుపత్రికి, నలుగురిని పెందుర్తి ప్రభుత్వాసుపత్రికి, ఒకరిని కొత్తవలస ప్రభుత్వాసుపత్రికి తరలించి, వైద్య చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ 8 మంది బాలికల ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రుల్లో కోలుకుంటున్నారని తెలిపారు. జిల్లా బిసి సంక్షేమాధికారి యశోధనరావు హుటాహుటిన కొత్తవలస వెళ్లి, బాలికల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మిగిలిన విద్యార్థులంతా పూర్తి ఆరోగ్యంతో, హాస్టల్‌లోనే ఉన్నారని కలెక్టర్‌ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img