Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బొడ్డవలస గురుకులంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలు జయమణి ఆరా…

జిల్లా కో-ఆర్డినేటర్, డిఎస్పిలతో మాట్లాడి విధ్యార్ధుల మద్య సామరస్య పరిష్కారం చేయాలని ఆదేశం
విశాలాంధ్ర-పార్వతీపురం: మన్యం జిల్లాలోని సాలూరు నియోజక వర్గ పరిధిలోని బొడ్డవలసలోని డాక్టరు బి ఆర్ అంబేద్కర్ గురుకులంలో విధ్యార్ధుల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలు,పార్వతీపురం మాజీఎమ్మెల్యే సవరపు జయమని స్పందించారు. దీనిపై అన్ని వివరాలను తెలుసుకొని ఉమ్మడి జిల్లాల సమన్వయ అధికారి చంద్రావతితో,పార్వతీపురం డి. ఎస్పీ సుభాష్ తో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని ఆదేశించారు. బయట వ్యక్తులు లోపలికి వెళ్ళడంపట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులం లోపల బీరు సీసాలు, సిగరెట్లు ఉన్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. విధ్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో శాంతి పూర్వక, స్నేహ పూర్వక వాతావరణం కల్పించాలని కోరారు. గాయలు తగిలిన విధ్యార్థులకు మెరుగైనవైద్యచికిత్స అందజేయాలని జిల్లా కో ఆర్డినేటర్ ను ఆదేశించారు. ముందు ముందు ఇటువంటి సంఘటనలు ఎస్సీ గురుకులాల్లో జరగకుండా చూడాలని ఆమెకోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img