Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మన్యం జిల్లా ఏడాది గడిచిన సందర్భంగా జిల్లా కలెక్టరు, ఎస్పీల ఆద్వర్యంలో శ్రమదాన కార్యక్రమం


ఆవిర్భావ దినోత్సవంను వినూత్నంగా చేసిన జిల్లా అధికార యంత్రాంగం
పెద్ద ఎత్తున తరలివచ్చిన జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది

విశాలాంధ్ర,పార్వతీపురం: జిల్లా ఆవిర్భవించి మంగళ వారం నాటికి ఏడాది పూర్తయినవేళ ఆవిర్భావ దినోత్సవంను వినూత్నంగా చేస్తే బాగుంటుందని ఆలోచించి జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఆనంద్, ఐటిడిఏ పిఓ విష్ణు చరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు, అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్ లు శ్రమదానం నిర్వహించి ఒక మంచి సందేశాన్ని అందించాలని తలచారు. వెంటనే ఆచరణలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నేతృత్వంలో శ్రీకారంచుట్టారు. పెద్దఎత్తున శ్రమదానం చేయడంకోసం వారితో పాటు జిల్లాలోని అన్నిశాఖల అధికారులు, ఉద్యోగులు,సిబ్బంది విచ్చేసి బృందాలుగా ఏర్పడి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జూనియర్ కళాశాల, టౌన్ పోలీస్ స్టేషన్, రెవిన్యూ డివిజనల్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ బంగళా వరకు గల రహదారిలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించడం, ప్రహారీ గోడలకు సున్నం వేసి సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పోలీస్ సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు, అదనపు పోలీసు సూపరింటెండెంట్ డా. ఓ.దిలీప్ కిరణ్ లు స్వయంగా గోడలకు సున్నంవేసి, చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేసి, కాలువల్లో పేరుకు పోయిన పూడికలను తొలగించి స్ఫూర్తిని, ప్రేరణను కల్పించగా వారిని జిల్లాలోని మిగిలిన శాఖల అధికారులు,ఉద్యోగులు, సిబ్బంది అనుసరించారు.
కార్యక్రమం ఆనంతరం జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఆవిర్భావ దినోత్సవంను వివిధ రకాలుగా చేయవచ్చని, ఒక మంచిసందేశం అందించాలనే ఉద్దేశంతో శ్రమదానంను చేశామన్నారు. ప్రతీఅంశంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలనేది ప్రధాన తన కర్తవ్యమన్నారు.
ఇదేకర్తవ్యం, సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు.
గతఏడాదికాలంలో జిల్లా మొట్టమొదటి పరిపాలనా బృందంలోగల అధికారులు, సిబ్బంది చక్కగా పనిచేశారని కొనియాడారు. చక్కటి ప్రణాళికలతో, మంచి ప్రయత్నంతో లక్ష్యాలు సాధించామన్నారు. ఇదే స్ఫూర్తి, పట్టుదల, అంకితభావంతో రానున్న రోజుల్లో పనిచేసి జిల్లాను అభివృద్ది పథంలో నడిపేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సుందర పట్టణంగా తీర్చిదిద్దడంలో పట్టణ ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. జిల్లాలో ప్రతి ఎకరాకు పూర్తిస్థాయిలో సాగునీరు అందినపుడు, ప్రతి ఎకరాలో పంట వేసి అధిక దిగుబడులు సాధించినప్పుడు, ప్రతి ఒక్కరూ అక్షరాస్యులుగా మారినపుడు, ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడు, ప్రతీఒక్కరూ అవగాహనతో ఆరోగ్య సేవలకు చేరువైనపుడు, ఇలా అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ది సాధించినప్పుడు పెద్ద ఎత్తున వేడుకలు చేసుకుందామని సూచించారు. జిల్లా అభివృద్ధికి అందరూ సిద్ధం అనే సందేశంతో శ్రమదానంకు ఉపక్రమించామని వివరించారు. జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు తోడ్పాటును అందించాలని కోరారు.
జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ జిల్లా ఆవిర్భావ దినోత్సవంను వినూత్నంగా నిర్వహించుటకు శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ ను అభినందించారు. జిల్లా అభివృద్ధిలో ప్రతీఒక్కరూ కీలక పాత్ర పోషించాలని, ప్రజలకు సంతృప్తికర సేవలు అందించాలని కోరారు.
శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని స్ఫూర్తిదాయక పనులుచేసిన వైద్య ఆరోగ్య శాఖ బృందానికి ప్రథమ బహుమతి,పశు సంవర్థక – టి.పి.ఎం.యు బృందంకు ద్వితీయ బహుమతి, పోలీసు బృందం కు తృతీయ బహుమతి, ఐసిడిఎస్ బృందానికి కన్సోలేశన్ బహుమతులను ప్రకటించి అందజేశారు.
ఈకార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె. హేమలత, డిఎస్పీలు ఏ. సుభాష్,బలివాడ నాగేశ్వరరావు, దీక్షిత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగన్నాథరావు, ఆర్.బి.ఎస్.కె ప్రాజెక్టు అధికారి భాస్కరరావు, జిల్లా పశు సంవర్థక అధికారి ఈశ్వరరావు, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజీ, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ రాబర్ట్ పాల్
జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు, జిల్లా గ్రామ పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, మునిసిపల్ కమీషనర్ ఎం.రామప్పల నాయుడు, డి ఐ ఓ డాక్టరు జగన్మోహన్, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి విజయ గౌరీ,తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img