Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మరిపివలసలో సీతారామ కళ్యాణం పూజలు ప్రారంభం

విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని మరిపివలస గ్రామంలో శ్రీరామనవమి పండుగ ఉత్సవాల్లో భాగంగా బుదవారంనాడు శ్రీసీతారామకళ్యాణనిమిత్తం అందరు మహిళ భక్తులు ముహూర్తపురాటను వేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం శ్రీరామ నవమి పురస్కరించుకుని వేదమంత్రాల సాక్షిగా పురోహితులు ఎం.ప్రసాదరావుశర్మ ఆద్వర్యంలో శాస్త్రోక్తంగా ముహూర్తపు రాటని వేసి తాంబూలాలు అందజేసారు. శ్రీరామ మందిరం వద్ద పూజలు నిర్వహించారు. సహకార సంఘం అధ్యక్షుడు మండల త్రినాథరావు దంపతులు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపిపి బొంగు వరలక్ష్మి,గ్రామానికి చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు.గురువారం సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా మండలంలోని సీతానగరం హనుమాన్ కూడలి వద్ద, సీతానగరం శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో, లచ్చయ్యపేట శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో, అన్ని గ్రామాలలోగల శ్రీరామ మందిరంలవద్ద, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలవద్ద శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను ఆయా కమిటీ సభ్యులు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img