Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

జంగారెడ్డిగూడెం లో నకిలీ 2వేల నోట్ల కలకలం

విశాలాంధ్ర-జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణంలో నకిలీ 2వేల నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది.ఈ వ్యవహారంపై పోలీసులు నిఘా పెట్టారు. స్ధానిక ఎస్ ఐ సాగర్ బాబు తన సిబ్బందితో పట్టణంలో దాడి చేశారు.ఈ దాడిలో మందపాటి రాజా,కోడూరి రవితేజ పారిపోయారని, కాట్రు వంశీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి నుండి రూ. 40లక్షల విలువైన 2వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లక్ష ఒరిజినల్ నోట్లు ఇస్తే రెండు లేదా మూడు లక్షల దొంగ నోట్లు ఇస్తామని చెప్పి కొందరిని నమ్మించి డబ్బు ఇచ్చే సమయంలో పోలీసులు వస్తున్నారని భయపెట్టి అసలు,దొంగ నోట్లను తీసుకుని పారిపోయే ముఠాగా వీరిని గుర్తించినట్లు ఎస్ ఐ తెలిపారు.ఈ ముఠా వల్ల నష్ట పోయిన బాదితులు స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి పిర్యాదు చేస్తే మోసం చేసిన ముఠాను పట్టుకుంటామని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సాగర్ బాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img