Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జననాయకుడు జన్మదినోత్సవానికి తరలివచ్చిన జన సందోహం…


విశాలాంధ్ర^ఉండి : రాష్ట్రంలోనే ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతూ పేదల పాలిట పెన్నిధిగా నిరంతరం పేదల కోసం పరితపించే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రామిక యోధుడు పచ్చదనం పరిమళాలతో నియోజకవర్గాన్ని సుందర నందనవనముగా తీర్చి దిద్దిన ప్రకృతి ప్రియుడు జననాయకుడు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు జన్మదినోత్సవ వేడుకలు భీమవరం ఆయన కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ కార్యకర్తల నడుమ తీన్మార్‌ డప్పులతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలు నాయకులు అభిమానులు పుష్పగుచ్చాలు సాలువాలతో ఆయన మెడని నింపి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ ఉండి నియోజకవర్గానికి పరిచయమై 10 సంవత్సరాల కాలం పాటు ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలను పొందుతూ ఉండి నియోజకవర్గ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని నింపుకున్నానని తెలిపారు. ఇంతమంది అభిమానుల నడుమ నా జన్మ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని నింపిందని తెలిపారు. అధిష్టానం ఆదేశాల మేరకు 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలై మూడున్నర సంవత్సరాల కాలం ప్రజలకు దూరంగా ఉన్నానని అయినప్పటికీ ప్రజలు నాపై చూపిస్తున్న ఆదరభిమానాలు మరువలేనివని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గాన్ని సంపూర్ణ అభివృద్ధి చేసిన ఘనత తమకే దక్కిందన్నారు.
నేటి నుండి శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్‌ సాగిరాజు సాంబశివరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త ద్వారంపూడి నారాయణరెడ్డి, బ్రహ్మారెడ్డి, పోత్తూరి వెంకటేశ్వరరాజు, టిడిపి మండల మాజీ అధ్యక్షులు జుత్తిగ శ్రీనివాసరావు, బురిడి రవి బాబు, మండ్రు సందీప్‌, దూసనపూడి, కాల గణేష్‌, రాంబాబు, ఉంగరాల నాగేశ్వరరావు, పొత్తూరి ఫణి రాజు, ఆరేటి తాత పండు, మోపిదేవి నాగ శ్రీనివాసరావు, పద్మావతి, భాస్కర్‌ రాజు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img