Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

జ్యోతిరావు పూలే ను ఆదర్శంగా తీసుకోవాలి…

విశాలాంధ్ర – కొయ్యలగూడెం: దళిత బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం 180 సంవత్సరాల క్రితమే మహాత్మ జ్యోతిరావు పూలే పోరాటాలు కొనసాగించారని పూలేను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడుచుకోవాలని పరింపూడి గ్రామపంచాయతీ సర్పంచ్ ముప్పిడి విజయ కుమారి పేర్కొన్నారు. స్థానిక అశోక్ నగర్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు వెలగల దుర్గారావు ఆధ్వర్యంలో196 వ పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ ముప్పిడి విజయ కుమారి మాట్లాడుతూ బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలన్నారు. వివిధ కుల వృత్తుల వారికి సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలను అందజేయాలని, ప్రత్యేక కార్పొరేషన్ నిధులతో బలహీన వర్గాల ప్రజలను ప్రభుత్వం అభివృద్ధి చేయాలని తెలిపారు. వెలగల దుర్గారావు మాట్లాడుతూ ప్రభుత్వాలు చట్టసభలలో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించాలని బీసీల హక్కుల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తాడిగడప ఆంజనేయరాజు, పంచాయతీ వార్డు మెంబర్లు రాచూరి మదన్, మలిశెట్టి కేసు బాబు, పులపల్లి రవికుమార్, సూది కొండల శివాజీ గణేష్, బుసి త్రిమూర్తులు, గోలిశెట్టి ప్రసాద్, ముప్పిడి చిన్నబాబు, మడుతూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img