Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టిడిపి నా ఊపిరి…గెలుపే నా లక్ష్యం..

ఎఎంసి మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు….

విశాలాంధ్ర /చాట్రాయి: టిడిపి నా ఊపిరి అని పార్టీ గెలుపే నా లక్ష్యంగా నిరంతరం పయనిస్తున్నానని నూజివీడు ఏఎంసీ మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు తెలిపారు. చాట్రాయి మండల టిడిపి కార్యాలయంలో మండల పార్టీ ఆధ్వర్యంలో కాపా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి కాపా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ యే తన శ్వాసగా,4 దశాబ్దాలుగా పనిచేస్తున్నానని గుర్తు చేశారు.పార్టీ లో పదవులు కన్నా ప్రజాసేవే మిన్నగా పనిచేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అదికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు మరిడి చిట్టిబాబు, తెలుగు రైతు జిల్లా మహిళా కమిటీ కార్యదర్శి మాదాసు చంద్రకళ, మాజీ ఎంపిపి కందుల కృష్ణ, వెల్ది రాజా, వెల్ది అప్పారావు, నోబుల్ రెడ్డి, కంచర్ల హనుమంతరావు, బొర్రానాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img