Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పార్టీకి ప్రజలకు మధ్య వారధులే గృహ సారధులు

ఎమ్మెల్యే వాసుబాబు

విశాలాంధ్ర – గణపవరం: పార్టీకి, ప్రజలకు మధ్య వారదులే ఈ గృహ సారధులు అని వారు చిత్తశుద్ధితో పనిచేయాలని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు వాసుబాబు అన్నారు. శుక్రవారం గణపవరం మండలంలోని పిప్పర ,కాశీపాడు ,చిలకంపాడు ,వీరేశ్వరపురం వల్లూరు వాకపల్లి, ముగ్గుళ్ల ,ఎ.గోపవరం కోమాట్లపాలెం గ్రామాలకు సంబంధించిన గృహ సారథులు శిక్షణా తరగతులలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీనీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తూ ప్రతీ కుటుంభానికి ప్రభుత్వము సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేరువ చేస్తూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మరో వ్యవస్థనే గ్రామ సచివాలయం కన్వీనర్లు, గృహ సారదలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లు కాకర బేబీ, పాఠంశెట్టి పద్మ, జడ్పిటిసి సభ్యులు దేవరపు సోమలక్ష్మి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దండు వెంకటరామరాజు (అర్థవరం రాము), కాకర శ్యామ్ సుందర్, దండు సూరిబాబు, పాఠంశెట్టి శ్రీనివాసరావు, ఎం ఆర్ కె, జంపన రమేష్ రాజు, వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img