Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్..

విశాలాంధ్ర – కొయ్యలగూడెం: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విద్యను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పారేపల్లి నరేష్ పేర్కొన్నారు. కొయ్యలగూడెం పట్టణంలో ఎస్ సి కాలనీలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను కొయ్యగూడెం పట్టణ, మండల తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జేష్ట రామకృష్ణ, మండల పార్టీ ఉపాధ్యక్షుడు నిమ్మగడ్డ రవీంద్రనాథ్, ఎర్రం పేట గ్రామపంచాయతీ సర్పంచ్ చాపల ఏసురత్నం, మంగపతి దేవి పేట గ్రామ కమిటీ అధ్యక్షుడు గన్నమని రత్నాజీ, ఎస్ సి సెల్ అధ్యక్షుడు ఉప్పాటి వెంకట్రావు, ఏలూరు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షులు చింతల వెంకటరమణ, ఆకుల అరుణ, పెండ్యాల రమాదేవి, చెరుకూరి రమ్య, నక్క రవి, మండల ప్రధాన కార్యదర్శి బొబ్బర చిన్నరాజు, ఆరేటి వీరపండు ,నాయుడు లీలాకాంత్ ,మేకల నాగేంద్రప్రసాద్, బెల్లాను శ్రీను, రాచూరి మదన్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img