Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రాజవరం వరప్రసాద మాతని దర్శించుకున్న పర్వతనేని…

విశాలాంధ్ర-ఆగిరిపల్లి : పిన్నమరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వేంచేసి ఉన్న రాజవరం వరప్రసాద్ మా తా తిరణాలకు టిడిపి నూజివీడు నియోజకవర్గం యువ నాయకులు పర్వత నేని గంగాధర్ సందర్శించారు.ఈ తిరుణాల సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ ప్రశాంతమైనటువంటి పల్లెల్లో ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఈ తిరణాల సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి గంగాధర్ రూ. 25 వేలు విరాళం అందజేశారు. రాబోయే రోజుల్లో వరప్రసాద్ మాత ఉత్సవాలు మరింత ఘనంగా జరుపుకోవడానికి సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిన్నెం రెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ జాల భూషణం, టిడిపి నాయకులు గోళ్ళ చంటి, మాజీ సర్పంచ్ రామ్ కోటేశ్వరావు, నూజివీడు నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు ఆరేపల్లి శ్రీనివాసరావు, శోభనాపురం సర్పంచ్ నక్కన బోయిన వేణు, ఈదర సర్పంచ్ దొండపాటి ఏసు పాదం, నెక్కలం గొల్లగూడెం నాయకులు నరదల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img