విశాలాంధ్ర – తాడేపల్లిగూడెం రూరల్ : అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో జరిగే రాష్ట్రస్థాయి బ్యాండ్ పోటీలకు పాల్గొనడానికి పెదతాడేపల్లిలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు వెళ్ళారని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బి. రాజారావు తెలిపారు. బుధవారం ఉ దయం పాఠశాల నుంచి తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్ చేరుకుని రైలు ప్రయాణం ద్వారా రాజంపేట చేరుకుంటారని తెలిపారు. ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర మానవ వనరుల శాఖ, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్కూల్ స్థాయి బ్యాండ్ పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. మొట్టమొదటి సారిగా రాష్ట్రస్థాయి పోటీ అన్ని రాష్ట్రాల్లో బ్యాండ్ పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం వీటిలో అత్యుత్తమ ప్రతిభ ఘనపరచిన వారిని ఎంపిక చేసి జాతీయ స్థాయికి పంపుతారని తెలిపారు. జాతీయ స్థాయిలో 8 జట్లు ఫైనల్ కి వెళతాయని తెలిపారు. ఎంపిక అయిన విద్యార్థులు 2023 జనవరి 26న జరిగే రిపబ్లిక్ పెరేడ్ వీక్షించే అవకాశం లభిస్తుందని తెలిపారు. భారత ప్రధాని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలుసుకునే అవకాశం వీరికి లభిస్తుందని తెలిపారు. గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో పోటీలలో పాల్గొనే విద్యార్థులకు శిక్షణ అందించామన్నారు. జాతీయ స్థాయిలో ఎంపిక కాబడే బ్యాండ్ పోటీలలో గురుకుల పాఠశాల విద్యార్థులు తప్పక ఉంటారని ఆశాభావం వ్యక్తంచేశారు.