విశాలాంధ్ర – పాలకొల్లు: ముఖ్యమంత్రి జగన్ కల్లుగీత కార్మికులకు వరాల వర్షం కురిపించిన సందర్భంగా కృతజ్ఞతో గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశైన, యాత కులస్తులంతా ఈనెల 13వతేదీ ఆదివారం ఉదయం గం.10లకు మోకులతో భారీ ఎత్తున నిర్వహించే ప్రదర్శనకు తప్పక హాజరు కావాలని బహుజన కులాల నాయకులు చింతపల్లి గురుప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందని, ముఖ్యఅతిథిగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య హాజరవుతారని తెలిపారు. మోకులు ధరించి కదం తొక్కుతూ పదం పాడుతూ సాగే చైతన్య యాత్రలో అందరూ పాల్గొనవలసిందిగా కోరారు.