Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

24/7 కార్తీకదీపం కాదు పంచాయతీ దీపం

పెనుమంట్ర:పగలు రాత్రి తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి.దీనికి నిదర్శనం గా మార్టేరు గ్రామపంచాయతీ పరిధిలో పగలు రాత్రి తేడా లేకుండా 24/7 కార్తీకదీపం కాదు పంచాయతీ విద్యుత్ దీపాలు మార్టేరు శివరావు పేట సచివాలయం -2 ముందు,మార్టేరు పెద్ద వీధి పోస్ట్ ఆఫీస్ ముందు ఉన్న విద్యుత్ స్తంభాలపై నిరంతరం వెలుగుతున్న విద్యుత్ దీపాలే.. దీంతో విలువైన విద్యుత్తు వృధా అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతూ ఉండడంతో వందలాది యూనిట్లు విద్యుత్ వృధా అవుతుంది. గ్రామంలో పట్టించుకునే వారే కరువయ్యారు. విద్యుత్ సరఫరా ఉన్నంతసేపు వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. ట్రాన్స్కో అధికారులు, పంచాయతీ వారు,సచివాలయ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img