ఉండి:ఉండి మండలం మహాదేవపట్నం గ్రామానికి చెందిన వేగేశ్న విశాలాక్షి ఇంటిలో మూడు రోజుల క్రితం చోరీ కాబడిన 28 కాసులున్నర బంగారం రికవరీ చేయడంలో ఎస్ ఈ బి అడిషనల్ ఎస్ పి ఏటివి రవికుమార్, భీమవరం రూరల్ సిఐ ఏ నాగ మురళి, ఉండి ఎస్ ఐ కే గంగాధర్ రావు , పోలీస్ సిబ్బంది పనితీరు భేష్ అని ఎస్ పి యు రవి ప్రకాష్ కొనియాడారు. ఉండి పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ పి రవి ప్రకాష్ మాట్లాడుతూ మహాదేవపట్నం గ్రామానికి చెందిన వేగేశ్న విశాలాక్షి ఆదివారం మధ్యాహ్నం భీమవరం నిర్మల ఫంక్షన్ హాల్ కు వివాహ శుభ కార్యక్రమానికి వెల్లగా అప్పటికే కాపు కాసుకుని ఉన్న నడిమిపల్లి వినోద్ రాజు విశాలాక్షి ఇంటిలోకి చొరబడి 28న్నర కాసులు బంగారాన్ని దొంగిలించారని తెలిపారు. విలువైన వస్తువులు ఇంటిలో ఉన్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వివాహాది శుభ కార్యక్రమాలకు వేరే చోట్లకు వెళ్ళినప్పుడు పోలీసు వారికి తెలియజేస్తే ఎల్ హెచ్ ఎం ఎస్ కెమెరాను అమర్చడం జరుగుతుందని తద్వారా ఎవరైనా ఇంటిలోకి చొరబడితే కంట్రోల్ రూమ్ లో సైరన్ మోగుతుందని ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఆ తర్వాత ఆ ఇంటి యజమాని సైరన్ మోగడంతో దొంగతనాన్ని అతి త్వరగా ఛేదించడం జరుగుతుందని సూచించారు. త్వరగా రికవరీ చేసిన సిబ్బందికి అతి త్వరలో రివార్డులు ఇవ్వడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబి అడిషనల్ ఎస్ పి ఏ టి వి రవికుమార్, భీమవరం రూరల్ సిఐ ఏ నాగ మురళి ఉండి ఎస్ ఐ కె గంగాధర్ రావు, ఏఎస్ఐ బండి సత్యనారాయణ, కానిస్టేబుల్స్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.