Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

అధ్వానంగా మారిన రహదారి

పెనుమంట్ర:బ్రాహ్మణ చెరువు – పొలమూరు – నౌవుడూరు ఆర్ అండ్ బి రోడ్డు గోతులతో అధ్వానంగా తయారు కావడంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ రోడ్డు సమస్య గత కొన్ని సంవత్సరాలుగా వాహనదారులను, స్థానికులను కలవర పెడుతూనే ఉంది.పొలమూరులో వసతి గృహం ప్రాంతం నుంచి నౌవుడూరు వరకు రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని గోతులు మయ మైంది. కురుస్తున్న వర్షాలకు ఆ గోతుల్లోకి నీరు చేరి చెరువుల దర్శనమిస్తున్నాయి. ప్రతినిత్యం ఈ రహదారిపై వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ వాహనాలు గోతుల్లో పడి వివిధ రకాల పనిముట్లు పాడైపోయి వాహనాలు కదలేని పరిస్థితి నెలకొంటుంది.ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు గోతుల్లో పడి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలవడం కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. అయితే గతంలో తూతూ మంత్రంగా గోతులు పూడ్చారే తప్ప శాశ్వత ప్రతిపాదికన పనులు చేపట్టలేదు. ఇటువంటి రోడ్లను ఎందుకు అభివృద్ధి చేయరని అధికారులను ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈ గోతుల్లో పడి కొత్త వాహనాలు సైతం పాడైపోతున్నాయని వారు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులైన జరిపించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img