పోడూరు: ప్రకృతి వ్యవసాయం లో భాగంగా భూమి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి నవధాన్యాలు వేసిన రైతులకు ఎస్ టూ ఎస్ కిట్లలో భాగంగా 3 కేజీలవేపపిండి, 4 లింగాకర్షక బుట్టలు, జీవామృతం సంచి , 250 గ్రామ్స్ కోడిగుడ్డు నిమ్మరసం, 4 లీటర్ల 12 రకాల బాక్టీరియా,2 లీటర్ల 6 రకాల పంగస్ జీవన ఎరువులను పొలంలో వాడుకోవాలని ప్రకృతి వ్యవసాయ విభాగం పశ్చిమగోదావరి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వై. నూకరాజు పేర్కొన్నారు. పోడూరులో రైతు భరోసా కేంద్రం వద్ద శనివారం రైతులకు ఎస్ టూ ఎస్ కిట్ల ఉపయోగాలు బయో కల్చర్ తయారు చేసుకునే విధానాన్ని ఆయన తెలియజేశారు. నవధాన్యాలు వేసిన రైతులు ఈ కిట్లు ఉపయోగించి ఆరోగ్య కరమైన ఉత్పత్తులు సాధించాలన్నారు ఎటువంటి రసాయనిక ఎరువులు వాడవద్దని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులను ఈ దిశగా చైతన్య పరచడానికి కృషి చేయాలన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేందుకు 18 రకాల బయో కల్చర్ వాడాలని భూమిలో కరిగిపోని రూపంలో ఉన్న నత్రజని పొటాషియం బాస్వరం ఎరువులతో పురుగులు, తెగుళ్లను పూర్తిగా నిర్ములించవచ్చునని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా బయో కల్చర్స్తతయారు చేసుకోవాలని
తెలిపారు. ఈకార్యక్రమంలోపశ్చిమగోదావరి జిల్లాకోఆర్డినెటర్ అరుణ కు మారి భీమవరం జోనల్ కోఆర్డినెటర్ చింత వీరస్వామి,గ్రామ సర్పంచ్ శెట్టి బత్తుల సువర్ణ రాజు ,పోడూరు మండల వైస్ ఎంపీపీ ఇందుకూరి సీతారామరాజు, ఏపీ సీడ్స్ కో ఆపరేటింగ్ డైరెక్టర్ పోతిమూడి రామచంద్రరావు , పోడూరు మండల ఏఈఓ పంచాయతీ కార్యదర్శి, విఎఎ లు జ్ఞానేశ్వరీ, సుమతి మండల ఇంచార్జిలు వెంకటేశ్వరరావు, రాంబాబు, ఐ సి ఆర్ పి లు సత్యకుమార్, స్వామి,భవాని,ఝాన్సీ, విజయలక్ష్మి , రైతులు పాల్గొన్నారు.