Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఈనెల 30న బిజిలి మహోత్సవం

ఏలూరు: ఈనెల 30వ తేదీన స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో బిజిలి మహోత్సవం నిర్వహింస్తున్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ) జి శ్యాంబాబు తెలిపారు. గురువారం ఏలూరు విద్యుత్ భవన్లోని సమావేశ మందిరంలో బిజిలి మహోత్సవం ఏర్పాట్లపై విద్యుత్ అధికారులతో ఎస్ఈ జి శాంబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజిలీ మహోత్సవం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, విద్యుత్ వినియోగదారులు హాజరవుతారని తెలిపారు. విద్యుదీకరణ మీద చిత్ర ప్రదర్శన, విద్యుత్తు పథకాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు, అదనపు విద్యుత్తు సామర్థ్యం మీద చిత్ర ప్రదర్శన, ఒకే దేశం, ఒకే గ్రిడ్, విద్యుత్తు పునరుత్పాదన శక్తి మీద చిత్రప్రదర్శన, వినియోగదారుల హక్కుల మీద చిత్రప్రదర్శన, రాష్ట్రం, జిల్లాలో సాధించిన విద్యుత్ ప్రగతి పై సమీక్ష జరుగుతుందని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటివరకు విద్యుత్ వినియోగదారులకు నిర్విరమంగా విద్యుత్ సంస్థ ఎనలేని సేవలు అందించినదన్నారు. 2047 లక్ష్యంగా విద్యుత్ శాఖ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్తు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు.బిజిలి మహోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిఈ టెక్నికల్ ఎం ఝాన్సీ, ఏలూరు ఈఈ ట.శశిధర్, జంగారెడ్డిగూడెం ఈఈ కేఎం అంబేద్కర్, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు తురగా రామకృష్ణ, ఏడిఈ, ఏఈలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img