Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నిర్వాసితులకు భరోసా చంద్రబాబు

టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మందపాటి

విశాలాంధ్ర విలేకరి చాట్రాయి : ఆపదలో ఉన్న వారికి అండగా నిర్వాసితులకు భరోసాగా చంద్రబాబు బాధితుల కోసం పని చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవా రెడ్డి అన్నారు. గురువారం చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వస్తున్న సందర్భంలో చాట్రాయి మండలం సీనియర్ నాయకుల బృందం అశ్వారావుపేట మండలం వినాయకపురం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తో కలిసి చంద్రబాబుకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మందపాటి మాట్లాడుతూ. పరిపాలనా అనుభవం కలిగిన ప్రజా నాయకుడు చంద్రబాబు అని ఆపదలో కష్టాల్లో ఉన్నందువలన వారి బాధలను చూడడానికి వచ్చారని తెలిపారు. వైజాగ్ లో తుఫాన్ వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గా పదవిలో వుండి క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించి తిరిగి వచ్చారు అని గుర్తు చేశారు. చంద్రబాబు కి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు మరియు చిట్టి బాబు మాజీ ఎంపిపి కందుల కృష్ణ సీనియర్ నాయకులు బొట్టు రామచంద్రరావు పుచ్చకాయల నోబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img