Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రజల అభివృద్ధి చేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి

చింతలపూడి రూరల్: ఎన్నికల వాగ్దానాలు నూరు శాతం నెరవేర్చి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా అన్నారు. ఎర్రగుంటపల్లి గ్రామ సచివాలయం ఒకటి పరిధిలో స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షత న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళ వారం నిర్వహించారు. ఈ సంధర్బంగా శాసన సభ్యులు గడపగడపకు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుని సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చటమే ముఖ్య లక్ష్యం గా పని చేస్తున్నారన్నారు.గ్రామప్రజలు రోడ్లు వేయాలని చెప్పడంతో వెంటనే రోడ్లు వేయించడం జరిగిందని తెలిపారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. హామీల్లో లేని సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు అందిస్తున్నామన్నారు. వైసిపి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ప్రజలకు ఏ రకమైన సమస్య ఉన్న తీర్చడానికి ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో
సర్పంచ్ తుల్లిమిల్లి రాణి, కుటుంబరావు, వైస్ ఎంపీపీ సాదరబోయిన వరలక్ష్మి,మార్కెట్ కమిటీ చైర్మన్ జె జానకిరెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, వెంప కృష్ణ,చిలుకూరి జ్ఞాన రెడ్డి,శానంపూడి కాంతారావు, ముల్లగిరి ఇమ్మనియేలు,ఎంపీడీఓ మణికుమారి, అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img