Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ప్రభుత్వ వైద్యుల పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

విశాలాంధ్ర – కొయ్యలగూడెం: ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు సరైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించడం లేదని గ్రామానికి చెందిన వాసా ప్రసాద్ , ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు తెల్లం బాలరాజుకు ఫిర్యాదు చేశారు. శాసనసభ్యులతో ప్రసాద్ మాట్లాడుతూ ఆసుపత్రిలోని సరైన వైద్యం అందడం లేదన్నారు. వైద్యులు ఉన్నప్పటికీ ప్రధమ చికిత్స కూడా నిర్వహించకుండా మెరుగైన వైద్యం అనే వంకతో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నారన్నారు. ఎక్సరే మిషన్ ఉన్నప్పటికీ ఉపయోగించడం లేదని ఏజెన్సీ ముఖద్వారమైన కొయ్యలగూడెం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగ అభివృద్ధి చేస్తే నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే బాలరాజుకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఆసుపత్రి అభివృద్ధికై ముఖ్యమంత్రి జగన్ కి సమాచారం అందించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img