తణుకు:త్వరలో తణుకు పారిశ్రామికవాడ కు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు రానున్నాయని ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు వంక రాజకుమారి అన్నారు . ఎం ఎస్ ఎం ఈ ద్వారా రూ.10 కోట్ల విలువైన సిమెంట్ రోడ్స్ , పూర్తి స్థాయిలో లో డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టడానికి అన్ని అనుమతులు వచ్చాయని,ఈ అధికారుల నివేదిక తో ప్రాజెక్ట్ కార్యరూపం లోకి రాగలగదని రాజకుమారి అన్నారు . గురువారం రాష్ట్ర కేంద్ర అధికారులు, ఎం ఎస్ ఎం ఈ అధికారులు, తణుకు పారిశ్రామిక వాడను పరిశీలించారు. ఎస్ఐడిబిఐ తరుపున తల్లూరి కామేశ్వరరావు, ఏపీఐఐసీ తరుపున సీనియర్ ఇంజనీర్ సి నాగభూషణం , జోనల్ మేనేజర్ జి కృష్ణ ప్రసాద్ , ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంక రవీంద్ర నాథ్ తో ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించారు . అధికారులు ఎస్టేట్ అవసరాన్ని గుర్తించి అప్రూవల్స్ కోసం వెంటనే అనుమతులు ఇస్తామని తెలిపారు. రవీంద్ర నాథ్ రాష్ట్రస్థాయిలో , కార్పొరేషన్ లో రాజకుమారి ఈ ప్రాజెక్టు కోసం ఎంతో పాటుపడ్డారని సీనియర్ ఇంజనీర్ నాగభూషణం అన్నారు . పారిశ్రామిక వాడలో ఉన్న వారు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. జవ్వాది తిమ్మయ్య నాయుడు, సాయి రామ్ రెడ్డి, సత్తి దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.