టీడీపీ డిమాండ్…
జంగారెడ్డిగూడెం: మండలం లోని పేరంపేట గ్రామ సర్పంచ్ కంకిపాటి కుమారిని ఆగ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం లోపలికి రాకుండా అధికారులు అడ్డుకుంటున్నారని సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం లో జరిగిన మీకోసం లో ఆర్డీవో ఝాన్సీ రాణి కి పిర్యాదు చేశారు.
ముందుగా ఆర్డీవో కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బాధితురాలు ,పేరంపేట సర్పంచ్ కంకిపాటి కుమారి మాట్లాడుతూ
ఎస్ సి మాదిగ సామాజిక వర్గానికి చెందిన తాను ప్రజా మద్దతుతోనే సర్పంచ్ గా గెలిచానని ,బాధ్యతలు స్వీకరించినప్పటినుండి తనకు సచివాలయం లో ఛాంబర్ కేటాయించకుండా,సచివాలయం లోకి రాకుండా తనను అధికారులే అడ్డుకుంటున్నారని వాపోయారు.
ఆ గ్రామ ప్రథమ పౌరురాలు అయిన ఆమె కేవలం దళిత మహిళ అయినందున, తెలుగుదేశం పార్టీ తరపున పోటీలో గెలవడం వల్ల
ఆ గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నేతలు , అధికారులు కలిసి గ్రామ సర్పంచ్ కి కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా లేకుండా చేయటం చాలా దారుణమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు.
ఎన్నికల్లో గెలిచే వరకే పార్టీలని,గెలిచిన తర్వాత అందరికీ ప్రజా ప్రతినిధి అని, ప్రజా మద్దతుతో గెలిచిన వారిని గౌరవించడం మన బాధ్యత అన్నారు. భారత రాజ్యాంగం ఉల్లంఘన చేస్తూ ప్రోటోకాల్ పాటించకుండా ఈ రకమైనటువంటి వివక్షను చూపించడం అత్యంత దారుణమన్నారు. వెనువెంటనే దళిత సర్పంచికి సీటు కేటాయించకపోతే పోరాటాలకు సిద్ధం అని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆర్డిఓ ఝాన్సీ రాణి స్పందించి వెంటనే అక్కడ ఉన్న పంచాయతీరాజ్ అధికారులకు సమస్యను రిఫర్ చేసి సాయంత్రం లోగా సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా టీడీపీ నాయకులు ఆర్డీవోకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొబ్బర రాజుపాల్ కుమార్,టీడీపీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వర రావు, మండల ఎస్ సి సెల్ అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ఎడ్లపల్లి ఏడుకొండలు, నంగులూరి జగత్, ముళ్ళపూడి శ్రీనివాస్, గోలిరామకృష్ణారెడ్డి, గంటా రామారావు, భూసా సత్యనారాయణ, లింగాల సత్యనారాయణ, గంధం అప్పాజీ, నిట్ట రాంకుమార్, లక్ష్మణరావు, క్రిష్ నాని, కారుమురి దుర్గారెడ్డి, చిట్టెమ్మ, ఉండవల్లి చంద్రరావు, ఉండవల్లి శ్రీను, రవి, శ్రీను, నవీన్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.