తాడేపల్లిగూడెం: కార్యకర్తలకు దళిత సేన అండగా ఉంటుందని దళిత సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జు వరపు రవి ప్రకాష్ అన్నారు. కడియద్దా గ్రామం చెందిన దళిత సేన సభ్యులు, కార్యకర్త మెరుపో భూలక్ష్మి కుమార్తె , ఉండ్రాజు వరపు నాగరాజు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి దళిత సేన అండగా ఉంటుందని భరోసా కల్పించారు. దళిత సేన తరపున కుటుంబానికి 25 కేజీలు చొప్పున 50 కేజీలు బియ్యం బస్తాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకర్లమూడి వెంకట్రావు ,కడియద్దా గ్రామ దళిత సేన అధ్యక్షులు ఉండ్రాజు వరపు కృష్ణ, గ్రామ మహిళా అధ్యక్షురాలు జాలపర్తి పద్మ, తాడేపల్లిగూడెం మండలం దళిత సేన ఉపాధ్యక్షురాలు జాలాది సునీత, దళిత సేన నాయకులు గడ్డం రాజు పాల్గొన్నారు.