Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అన్నా క్యాంటీన్ కూల్చివేత దుర్మార్గం

టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి

చాట్రాయి: పేదోళ్ళకు పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో కుప్పంలో అన్నా క్యాంటిన్ పెడితే దాన్ని కూల్చివేసి … జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి పై దాడికి పాల్పడడం అంటే ఈ రాష్ట్రంలో సాగుతున్న పరిపాలన స్వభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని
టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి మండిపడ్డారు.గురువారం మండల కేంద్రమైన చాట్రాయి గ్రామంలో టిడిపి మండల అధ్యక్షులు మరిడి చిట్టిబాబు ఆధ్వర్యంలో కుప్పంలో అన్నా క్యాంటీన్ కూల్చివేతకు నిరసనగా దర్నానిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన జరిగిన సభలో మందపాటి మాట్లాడుతూమాజీ ముఖ్యమంత్రి పైనే దాడికి పాల్పడ్డాడని ప్రయత్నం జరిగిందంటే వాళ్ళ మనస్తత్వం ఎంత రాక్షసత్వం తో కూడుకొన్నదో అర్థమవుతోందన్నారు. సీనియర్ నాయకులు బొట్టు రామచంద్రరావు మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీఆర్ పేరుతో పేదలకు పట్టాలు అన్నం పెట్టాలని మానవతాహృదయం తో కట్టిన అన్న క్యాంటీన్ ను కూల్చడందుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు.టిడిపి మం అధ్యక్షులుమరిడి చిట్టిబాబు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు గుండాగిరి తో పేదల నోటికాడ కూడు తీశారని ప్రజలెవరికీ సరైన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img