Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

విశాలాంధ్ర, జంగారెడ్డిగూడెం : అకాల వర్షాలతో పంట నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు.మంగళవారం అకాల వర్షాలకు నీట మునిగిన పంటలను టిడిపి బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వర రావు, దళిత రైతు తాళ్లూరు వెంకటేశ్వరరావుతో కలిసి తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు పరిశీలించారు. ఈ సందర్భంగా దాసరి శ్యామ్ చంద్ర శేషు మాట్లాడుతూ అకాల వర్షాలతో పొగాకు, మొక్కజొన్న, మిరప,కోకో, వేరుశనగ, అరటి, మామిడి,జీడిమామిడి రైతులు నష్టపోయారని ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి వారికి ఆర్థిక సహాయాన్ని అందించి వారిని ఆదుకుని ,ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
రైతులు పోల్నాటి ప్రభాకర్,కే.సురేష్ లు మాట్లాడుతూ తాము వేసిన పొగాకు పంటకు అకాల వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకుని మాకు సహాయం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి రాగాని రామకృష్ణ, పులపాకుల విజయ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img