చింతలపూడి: శంకు చక్రపురం గ్రామంలో శిధిల వ్యవస్థలో ఉన్న మండల ప్రజా పరిషత్ పాఠశాల నూతన భవనాన్ని మంజూరు చేసి, బుధవారం మండల ప్రజాపరిషత్ నూతన పాఠశాల భవనానికి ఎంపీపీ రాంబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగడవరం సర్పంచి భూపతి, వైసిపి జిల్లా సంయుక్త కార్యదర్శి రమేష్ రెడ్డి, ఎంపిటిసి నాగలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబశివరావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ తంబి, రమేష్, నరసింహారావు, సందీప్, మల్లు వైసిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు విద్యార్థులు పాల్గొన్నారు.