Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సత్కారం

పాలకొల్లు: పాలకొల్లు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల చంద్రసేన గుప్త 6వ రోజు జయంతి వేడుకలను పురస్కరించుకుని మంగళవారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను ఘనంగా సత్కరించారు. పాలకొల్లు గామాస్ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు పచ్చిగోళ్ళ వీర వెంకట నాగ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జర్నలిస్టులను సన్మానించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కే వి ఎస్ ఎల్ నరసింహరాజు, కోశాధికారి తోట రాంబాబు, గోపరాజు గోపి, పి.టి వెంకటేశ్వరరావు, ఎం.ఎన్.వి సాంబశివరావు, పడాల గోపికృష్ణ, మండెల అప్పలరాజు, మానాపురం సత్యనారాయణ, కూనపురెడ్డి చిన్ని, తమ్మినీడి మురళీకృష్ణ, భానులను వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సత్కరించారు. పాదర్తి వి.ఏస్ నాగేశ్వరావు, నాళం వెంకట్రామయ్య, శ్రిఖాకొల్లు కామేశ్వరరావు, కొనగళ్ళ వీర వెంకట సత్యనారాయణ, సంక మురళి, పేర్ల రాము, జల్లూరి రామలింగేశ్వరరావు, మాటూరి సోమేశ్వర వెంకట రామకుమార్, పిరాట్ల శ్రీను, ఖండవిల్లి రాఘవేంద్ర గుప్తా, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img